ETV Bharat / bharat

సాగు చట్టాల రద్దుకై రాష్ట్రపతికి విపక్షాల వినతి

author img

By

Published : Dec 9, 2020, 5:45 PM IST

Updated : Dec 9, 2020, 6:42 PM IST

సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పాయి విపక్షాలు. ఇదే విషయాన్ని రాష్ట్రపతి కోవింద్​తో జరిగిన భేటీలోనూ స్పష్టంగా చెప్పినట్టు వివరించాయి. ఈ మేరకు రాష్ట్రపతికి మెమొరాండం అందించినట్టు వెల్లడించాయి. రైతుల సమస్యలను తీర్చడం కేంద్రం బాధ్యతని గుర్తుచేశాయి.

Opposition meets President Ramnath Kovind amid Farmers protests
రైతుల ఆందోళనల మధ్య రాష్ట్రపతితో విపక్షాలు భేటీ

రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో విపక్షాలు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యాయి. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించాయి.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, సీపీఐఎమ్​ ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎమ్​కే నేత టీకేఎస్​ ఇళంగోవన్​తో కూడిన బృందం రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతిని కలిసింది. చట్టాలపై నిరసన తెలుపుతూ మెమొరాండం అందించింది.

opposition-meets-president-ramnath-kovind-amid-farmers-protests
రాష్ట్రపతికి మెమొరాండం అందజేస్తున్న విపక్ష నేతలు

"నూతన వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చలు లేకుండా, ఓటింగ్​ జరగకుండా, అప్రజాస్వామికంగా పార్లమెంట్​లో ఆమోదించారు. ఈ చట్టాలు భారత ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. ఇవి భారత వ్యవసాయ రంగం, రైతులను నాశనం చేసే విధంగా ఉన్నాయి. కనీస మద్దతు ధరను రద్దు చేసేందుకు ఈ చట్టాలు పునాదులు వేస్తున్నాయి. వీటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి."

--- విపక్షాలు

ఇదీ చూడండి:- 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం నిలవదు'

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్​ గాంధీ. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రపతికి వివరించినట్టు పేర్కొన్నారు.

అప్రజస్వామికంగా ఈ చట్టాలను ఆమోదించిన ప్రభుత్వం.. ఎందరో రైతుల జీవితాలను ప్రమాదంలో పెట్టిందని ఆరోపించారు సీపీఎమ్​ నేత సీతారామ్​ ఏచూరి. అందువల్ల వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్​ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు ఎన్​సీపీ నేత శరద్​ పవార్​ పేర్కొన్నారు. వారి సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:- ఆ పథకానికి కేంద్రం ఆమోదం- లక్షలాది మందికి లబ్ధి

రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో విపక్షాలు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యాయి. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించాయి.

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​, సీపీఐఎమ్​ ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎమ్​కే నేత టీకేఎస్​ ఇళంగోవన్​తో కూడిన బృందం రాష్ట్రపతి భవన్​లో రాష్ట్రపతిని కలిసింది. చట్టాలపై నిరసన తెలుపుతూ మెమొరాండం అందించింది.

opposition-meets-president-ramnath-kovind-amid-farmers-protests
రాష్ట్రపతికి మెమొరాండం అందజేస్తున్న విపక్ష నేతలు

"నూతన వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చలు లేకుండా, ఓటింగ్​ జరగకుండా, అప్రజాస్వామికంగా పార్లమెంట్​లో ఆమోదించారు. ఈ చట్టాలు భారత ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. ఇవి భారత వ్యవసాయ రంగం, రైతులను నాశనం చేసే విధంగా ఉన్నాయి. కనీస మద్దతు ధరను రద్దు చేసేందుకు ఈ చట్టాలు పునాదులు వేస్తున్నాయి. వీటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి."

--- విపక్షాలు

ఇదీ చూడండి:- 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం నిలవదు'

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్​ గాంధీ. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రపతికి వివరించినట్టు పేర్కొన్నారు.

అప్రజస్వామికంగా ఈ చట్టాలను ఆమోదించిన ప్రభుత్వం.. ఎందరో రైతుల జీవితాలను ప్రమాదంలో పెట్టిందని ఆరోపించారు సీపీఎమ్​ నేత సీతారామ్​ ఏచూరి. అందువల్ల వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్​ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు ఎన్​సీపీ నేత శరద్​ పవార్​ పేర్కొన్నారు. వారి సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:- ఆ పథకానికి కేంద్రం ఆమోదం- లక్షలాది మందికి లబ్ధి

Last Updated : Dec 9, 2020, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.